టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తా: మర్రి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, November 18, 2018

టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తా: మర్రి


సనత్ నగర్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్‌రెడ్డి కూటమి పొత్తుల్లో ఆ స్థానం టీడీపీకి వెళ్లడంతో అసంతృప్తికి గురైన విషయం తెలిసిందే. అయితే ఆయనను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీకి పిలిచింది. అధిష్టానంతో మాట్లాడిన ఆయన సనత్‌నగర్ టికెట్‌ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైతే సికింద్రాబాద్ టికెట్ టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. తాను మాత్రం సికింద్రాబాద్ నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదంటూ, సనత్‌నగర్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad