ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 రోజుల విరామం అనంతరం రేపటి నుంచి(సోమవారం) ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించబోతున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్టులో గత నెల 25వ తేదీన ఆయనపై హత్యాయత్నం జరిగిన తర్వాత వైద్యుల సలహా మేరకు పాదయాత్రకు విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ప్రకటించిన ఈ పాదయాత్ర గత నవంబర్ 6వ తేదీన మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 11 జిల్లాల్లో జగన్ పాదయాత్రను పూర్తి చేశారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర పూర్తైన తర్వాత శ్రీకాకుళంతో పాదయాత్ర ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 రోజుల విరామం అనంతరం రేపటి నుంచి(సోమవారం) ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించబోతున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్టులో గత నెల 25వ తేదీన ఆయనపై హత్యాయత్నం జరిగిన తర్వాత వైద్యుల సలహా మేరకు పాదయాత్రకు విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ప్రకటించిన ఈ పాదయాత్ర గత నవంబర్ 6వ తేదీన మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 11 జిల్లాల్లో జగన్ పాదయాత్రను పూర్తి చేశారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర పూర్తైన తర్వాత శ్రీకాకుళంతో పాదయాత్ర ముగియనుంది.
No comments:
Post a Comment