12 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 08, 2018

12 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభం


ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం తర్వాత కొంతకాలంగా విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్న జగన్ మళ్లీ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 12వ తేదీ నుంచి పాదయాత్రను కొనసాగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక రోజు ముందుగానే విశాఖ చేరుకుని తర్వాత రోజు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 

No comments:

Post a Comment

Post Bottom Ad