ఒక్క చెరువుకైనా కట్ట వేయించగలిగారా: హరీశ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 16, 2018

ఒక్క చెరువుకైనా కట్ట వేయించగలిగారా: హరీశ్


సునీతారెడ్డి నీటి పారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క చెరువు కట్టను కూడా బాగుచేయలేకపోయారని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నర్సాపూర్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కంటే ముందు పదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి, నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిపై ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామంటూ సునీతారెడ్డికి సవాల్‌ చేశారు. మీ పాలనలో ఎరువులు, విత్తనాల కొరత, దొంగరాత్రి కరెంటు తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad