గుజరాత్ శాసనసభ్యుడు జిగ్నేష్ మేవాని, జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్లపై సిరా దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ‘సంవిధాన్ బచావో’ ఆందోళన కార్యక్రమంలో భాగంగా స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్లో సెమినార్కు వెళుతుండగా హిందూ సేన కార్యకర్త ముకేశ్ పాల్ దాడికి పాల్పడి సిరా చల్లినట్టు వెల్లడించారు. సిరా దాడి జరిగినప్పటికీ జిగ్నేష్, కన్హయ్యకుమార్ సెమినార్లో పాల్గొన్నారని తెలిపారు. కాగా ఈ దుశ్ఛర్యకు పాల్పడిన ముకేశ్ పాల్ను అరెస్ట్ చేశారు.
Post Top Ad
Tuesday, November 20, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment