అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్‌ను చిత్తు చేసిన భారత్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 12, 2018

అదరగొట్టిన అమ్మాయిలు.. పాక్‌ను చిత్తు చేసిన భారత్‌

Team-India-Beats-Pakistan-By-Seven-Wickets

వెస్టిండీస్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు వరుసగా రెండో విజయం నమోదు చేశారు. దాయాది పాకిస్థాన్‌పై కదం తొక్కారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 20 ఓవర్లలో 133 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ ఒక ఓవర్‌ ఉండగానే మ్యాచ్‌ను  ముగించింది. సీనియర్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌ (56 పరుగులు 47 బంతులు) స్మృతి మంధానా (26 పరుగులు 28 బంతులు) రాణించడంతో సులువుగా విజయాన్ని అందుకుంది. చివరల్లో వికెట్లు కోల్పోయినా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (14 పరుగులు 13 బంతులు) వేద కృష్ణమూర్తి (8 నాటౌట్‌; 5 బంతులు) రాణించడంతో విజయకేతనం ఎగరేసింది. మిథాలీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచింది.

No comments:

Post a Comment

Post Bottom Ad