యువ కథానాయకుడు సుమంత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బుధవారం విడుదలైన ఈ సినిమా టీజర్కు సినిమా అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో సుమంత్ సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఉన్న సుబ్రమణ్య స్వామి ఆలయంపై పరిశోధనలు చేస్తూ కనిపించారు. బి. సుధాకర రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అరవింద సమేత ఫేం ఈషా రెబ్బ కథానాయికగా నటిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment