శ్రీనివాసరావును జైళ్లో కలిసిన తల్లిదండ్రులు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 16, 2018

శ్రీనివాసరావును జైళ్లో కలిసిన తల్లిదండ్రులు!


విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై కత్తితో దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావును విశాఖ సెంట్రల్ ప్రిజన్లో తల్లిదండ్రులు గురువారం తొలిసారిగా కలిశారు. 15 రోజుల పాటు జైళ్లో ఉన్న శ్రీనివాస్‌ను కలవడానికి అతడి తల్లి సావిత్రమ్మ, అన్నయ్య సుబ్బరాజు, బంధువు బత్తుల రామకృష్ణ ప్రసాద్‌ వచ్చారు. శ్రీనివాసరావును కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. బెయిల్‌ మీద తనను బయటకు తీసుకెళ్లాలని చెప్పాడని తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత జరిగినదంతా మీడియా ముందు చెప్తానన్నాడని తెలిపారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad