డీఎస్సీ అభ్యర్థినిపై ముగ్గురి లైంగికదాడి? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, November 01, 2018

డీఎస్సీ అభ్యర్థినిపై ముగ్గురి లైంగికదాడి?

అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థినిపై ముగ్గురు లైంగికదాడికి పాల్పడినట్లు తెలిసింది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని మోపిదేవివార్పు వద్ద జరిగిన ఈ ఘటన బుధవారం రాత్రి వెలుగుచూసింది. కోడూరు మండలానికి చెందిన ఓ యువకుడు, మోపిదేవి మండలానికి చెందిన ఓ యువతి.. రోజూ బైక్‌పై అవనిగడ్డలో డీఎస్సీ కోచింగ్‌కు వెళుతోంది. మంగళవారం రాత్రి కోచింగ్‌ పూర్తయ్యాక బైక్‌పై వస్తున్న వీరిని మోపిదేవి వార్పు వద్ద అటకాయించిన ముగ్గురు యువకులు.. యువకుడిని చెట్టుకు కట్టేసి యువతిపై లైంగిక దాడికి దృశ్యాలను వీడియో కూడా తీసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి.. నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నట్టు సమాచారం. మూడో వ్యక్తికి కూడా ఈ విషయం తెలియడంతో వల్లూరులో లారీ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు వదంతలు వినిపిస్తున్నాయి. బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు నిరాకరించడంతో రాజీ చేసినట్టు తెలిసింది.

No comments:

Post a Comment

Post Bottom Ad