కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్కుమార్(59) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీశంకర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అమెరికా, న్యూయార్క్లోకి క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో చికిత్స పొంది గత నెల బెంగళూరు వచ్చారు. అనంతరం శ్రీశంకర ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూమృతి చెందారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పార్థివదేహాన్ని బెంగళూరులోని నేషనల్ కాలేజీలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతకుమార్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం ప్రకటించారు.
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్కుమార్(59) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని శ్రీశంకర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అమెరికా, న్యూయార్క్లోకి క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో చికిత్స పొంది గత నెల బెంగళూరు వచ్చారు. అనంతరం శ్రీశంకర ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూమృతి చెందారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పార్థివదేహాన్ని బెంగళూరులోని నేషనల్ కాలేజీలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతకుమార్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం ప్రకటించారు.
No comments:
Post a Comment