సమైక్య భారత నిర్మాత, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్కు సమున్నత గౌరవం కల్పిస్తూ... విచ్ఛిన్న భారత భూభాగాల్ని ఏకం చేసిన ధీశాలికి భారత జాతి ఘనమైన నివాళి అర్పించింది. ఆయన 143వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 182 మీటర్ల(597 అడుగులు) సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భారత వైమానిక దళ విమానాలు, హెలికాప్టర్లు జాతీయ పతాక రంగులు వెదజల్లుకుంటూ విగ్రహానికి సమీపంగా దూసుకెళ్లిన దృశ్యాలు వీక్షకులకు కనువిందు చేశాయి. సమైక్య భారతావనికి మద్దతు ఇస్తూ తమ రాజ్యాల్ని వదులుకున్న రాజ వంశాల మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని మోదీ గుజరాత్ ప్రభుత్వానికి సూచించారు. గుజరాత్లోని సరోవర్ డ్యాంకు సమీపంలో సాధు బెట్ అనే దీవిలో కొలువుదీరిన ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అని నామకరణం చేశారు.
Post Top Ad
Thursday, November 01, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment