భారత బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మంగళవారం తిరువమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున స్వామివారి అర్చన సేవలో కుమారుడు అనంత్ అంబానీతో కలసి పాల్గొన్నారు. త్వరలో కుమార్తె ఇషా అంబానీ వివాహం జరగనున్న నేపథ్యంలో కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను ముఖేశ్ అంబానీకి అందజేశారు.
Post Top Ad
Tuesday, November 27, 2018
శ్రీవారి పాదాల చెంద ఇషా వివాహ ఆహ్వాన పత్రిక
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment