కేటీఆర్‌ నామినేషన్‌.. కాంగ్రెస్‌ ఆందోళన - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 19, 2018

కేటీఆర్‌ నామినేషన్‌.. కాంగ్రెస్‌ ఆందోళన

Minister-KTR-Files-Nomination-At-Sircilla
సిరిసిల్ల నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి కె.తారక రామారావు నామినేషన్‌ వేశారు. రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్‌కు నామపత్రాలను అందజేశారు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డి సైతం నామినేషన్‌ వేయడానికి వచ్చారు. దీంతో అక్కడ ఆందోళన నెలకొంది. రిటర్నింగ్ అధికారి వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కేటీఆర్‌తో 60 మందిని లోపలికి పంపుతున్నారని, తమను మాత్రం కేవలం పది మందిని మాత్రమే అనుమతించారంటూ నిరసన తెలిపారు. పోలీసులకు, కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad