సిరిసిల్ల నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి కె.తారక రామారావు నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్కు నామపత్రాలను అందజేశారు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి సైతం నామినేషన్ వేయడానికి వచ్చారు. దీంతో అక్కడ ఆందోళన నెలకొంది. రిటర్నింగ్ అధికారి వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కేటీఆర్తో 60 మందిని లోపలికి పంపుతున్నారని, తమను మాత్రం కేవలం పది మందిని మాత్రమే అనుమతించారంటూ నిరసన తెలిపారు. పోలీసులకు, కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Post Top Ad
Monday, November 19, 2018
కేటీఆర్ నామినేషన్.. కాంగ్రెస్ ఆందోళన
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment