చరిత్రలో తొలిసారి: శబరిమల ఆలయంలో మహిళా కానిస్టేబుళ్లు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 05, 2018

చరిత్రలో తొలిసారి: శబరిమల ఆలయంలో మహిళా కానిస్టేబుళ్లు

Kerala-Govt-Appointed-Women-Constables-In-Sabarimala-Temple

శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నేడు తెరుచుకోనున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయ చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వం 15 మంది మహిళా పోలీస్‌ ఉద్యోగులను ఆలయం వద్ద భద్రతా విధుల నిర్వహణ కోసం నియమించింది. అయితే వీరంతా 50 ఏళ్ల పైబడిన వారు కావడం గమనార్హం. ఆలయ సాంప్రదాయం ప్రకారం 10 సంవత్సరాల లోపు బాలికలు.. 50 ఏళ్ల పైబడిన మహిళలను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ విషయం సదరు ఉద్యోగినులు మాట్లాడుతూ ఆలయ నిబంధనలు ఉల్లంఘించి దర్శనం కోసం ప్రయత్నించే మహిళలను అడ్డుకోవడమే కర్తవ్యం అని తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad