టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ క్వార్టర్లో సర్ధుబాటు స్ధూల ఆదాయం(ఏజీఆర్)లో తొలిస్థానంలో నిలిచింది. ట్రాయ్ డేటా ప్రకారం జియో ఈ క్వార్టర్లో ఏకంగా రూ.8271 కోట్లను ఆర్జించింది. వొడాఫోన్ ఐడియా రూ 7528 కోట్లతో తరువాతి స్థానంలో ఉండగా, రూ 6720 కోట్ల ఏజీఆర్తో భారతీ ఎయిర్టెల్ మూడవ స్ధానంలో నిలిచింది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆదాయం రూ.1284 కోట్లుగా నమోదైంది. ఏజీఆర్ మార్కెట్ వాటాలో 22 టెలికాం సర్కిళ్లలో 11 సర్కిళ్లలో జియో ముందుండగా, ఆరు సర్కిళ్లలో ఎయిర్టెల్, 5 టెలికాం సర్కిళ్లలో వొడాఫోన్ ఐడియా భారీ రాబడిని రాబట్టాయి.
Post Top Ad
Monday, November 26, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment