రోహిత్‌ షో.. భారత్‌ ఘనవిజయం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 07, 2018

రోహిత్‌ షో.. భారత్‌ ఘనవిజయం

India-Win-By-71-Runs

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెలరేగి ఆడడంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ కౌవశం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన సత్తా చాటింది. ఇరువై ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. హిట్‌‘మ్యాన్‌’ రోహిత్‌ శర్మ 61 బంతుల్లో 111 నాటౌట్‌(8 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగగా శిఖర్‌ ధావన్‌ 41 బంతుల్లో 43 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. భారీ లక్ష్యంతో బరిలో దిగిన విండీస్‌ ఇరువై ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 చేసి పరాజయం పాలైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, బూమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, కులదీప్‌ యాదవ్‌ తలా రెండు వికెట్లు తీశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad