ప్రజలకు ఏదైనా ఆపద వస్తే సాయం చేయడంలో హీరో సూర్య కుటుంబం ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా గజ తుపానుతో తీవ్రంగా నష్టపోయిన తమిళనాడుకు ఆదుకునేందుకు మరోసారి ముందుకువచ్చారు. సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం సూర్య కుటుంబం 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించింది. హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక, తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ నలుగురు కలిసి వారి తరఫున ఈ డబ్బును సీఎం సహాయనిధికి ఇవ్వనున్నారు. వారితో పాటు సినీ తారలు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు తమ వంతు బాధ్యతను తీసుకుంటున్నాయి.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment