ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచి భారత్ ఆసీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే మ్యాచ్కు వరుణుడు అడ్డు రావడంతో డక్వర్త్ లూయిస్ నియమం ప్రకారం 174 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు పెట్టింది. ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 17 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ అర్ధ సెంచరీతో రాణించినా భారత్ పరాజయం చవిచూసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి(4), ఓపెనర్ రోహిత్ శర్మ(7) నిరాశపరిచారు. దినేశ్ కార్తీక్ (30), రిషభ్ పంత్ (20) పరుగులు చేశారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment