బంగ్లాదేశీయలుపై అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, November 30, 2018

బంగ్లాదేశీయలుపై అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు

Amit-Shah-Sensational-Comments-On-Bangladeshi-Migrants
భారత్‌లోకి చొరబడుతున్న బంగ్లాదేశీయులను ఏరి పారేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా గురువారం అన్నారు. డిసెంబర్‌ 7న రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరౌలి జిల్లాలో ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోకి అక్రమంగా చొరబడిన వారిని అలాగే ఉండనిద్దామా? అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్నా చొరబాట్లను కాంగ్రెస్‌ అరికట్టలేకపోయిందని విమర్శించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, అస్సాం నుంచి గుజరాత్‌ వరకు దేశంలో ఉన్న అక్రమ వలసదారులందర్నీ ఏరి పారేస్తామన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad