హిమాచల్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సిర్మౌర్లో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి జలాల్ వంతెనపై నుంచి నదిలో పడడంతో 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు శ్రీ రేణుకాజీ ప్రాంతం నుంచి నాహాన్కు వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అడిషనల్ ఎస్పీ వీరేంద్ర సింగ్ ఠాకూర్ చెప్పారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment