టెస్టుల్లో వరుసగా మూడు సంవత్సరాల్లోనూ వేయి పరుగులు చొప్పున చేసిన బ్యాట్సమన్ గా కోహ్లీ రికార్డు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 05, 2018

టెస్టుల్లో వరుసగా మూడు సంవత్సరాల్లోనూ వేయి పరుగులు చొప్పున చేసిన బ్యాట్సమన్ గా కోహ్లీ రికార్డు


వెస్టిండీస్ తో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్టు మ్యాచులో ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. వరుసగా మూడేళ్లలో (2016, 2017, 2018) టెస్టుల్లో వేయి పరుగులు సాధించిన తొలి భారత బ్యాట్సమన్ గా సంచలనం సృష్టించాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ తో సహా ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ బ్యాట్సమన్ మాథ్యూ హేడెన్ అగ్రస్థానంలో ఉన్నాడు. మాథ్యూ 2001 నుంచి 2005 వరకు వరుసగా ఐదేళ్లు టెస్టులో వేయి పరుగుల చొప్పున సాధించాడు. మాథ్యూ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు. స్మిత్ 2014 నుంచి 2017 వరకు వరుసగా నాలుగేళ్లు టెస్టుల్లో వేయిపరుగుల చొప్పున చేశాడు. మాధ్యూ, స్మిత్ ల తర్వాత వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఉన్నాడు. లారా.. 2003 నుంచి 2005 వరకు వరుసగా వేయి పరుగుల చొప్పున చేశాడు. లారా తర్వాత ట్రెస్కోధిక్, కెవిన్ పీటర్ సన్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఐదుగురి సరసన ఆరో బ్యాట్సమన్ గా విరాట్ కోహ్లీ చేరాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad