విజయవాడలో తొలి రోజు పోటెత్తిన భక్తులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 11, 2018

విజయవాడలో తొలి రోజు పోటెత్తిన భక్తులు


దేవీ నవరాత్రుల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన విజయవాడ దుర్గమ్మని తొలి రోజు బుధవారం 40 వేల మంది దర్శించుకున్నారు. తొలిరోజు వీఐపీలు పోటెత్తడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. తొలి పూజను ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు చేశారు. భక్తుల రద్దీని దృష్టిని ఉంచుకుని పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందిపడకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయితే విరాళాలు ఇచ్చిన భక్తులను, పసుపు-కుంకుమ పూజలు చేసిన భక్తులను కూడా రూ.300 దర్శనానికిపై పంపడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు లిఫ్ట్ సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో అందులో భక్తులు ఆందోళన చెందారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad