హైదరాబాద్ లోని కూకట్ పల్లి తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ కు చెందిన మాధవరం కృష్ణారావుకు సొంత పార్టీ కార్పొరేటర్ కావ్యారెడ్డి ఝలక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి తెలగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొంది ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.. మాధవరం కృష్ణారావు. తాజాగా వచ్చే ఎన్నికల కోసం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనూ మాధవరం కృష్ణారావుకు చోటు దక్కింది. అయితే కూకట్ పల్లి కార్పొరేటర్, టీఆర్ఎస్ నేత కావ్యారెడ్డి మాధవరం కృష్ణారావుపై నిప్పులు చెరిగారు. భూకబ్జాలకు పాల్పడుతున్న ఆయన తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను దారిమళ్లించి తన భవనాల ముందు మాధవరం రోడ్లు వేయించుకున్నారని ఆరోపించారు. కార్పొరేటర్ చెప్పిన పనులు చేయొద్దని అధికారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ కు చెందిన మాధవరం కృష్ణారావుకు సొంత పార్టీ కార్పొరేటర్ కావ్యారెడ్డి ఝలక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి తెలగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొంది ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.. మాధవరం కృష్ణారావు. తాజాగా వచ్చే ఎన్నికల కోసం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోనూ మాధవరం కృష్ణారావుకు చోటు దక్కింది. అయితే కూకట్ పల్లి కార్పొరేటర్, టీఆర్ఎస్ నేత కావ్యారెడ్డి మాధవరం కృష్ణారావుపై నిప్పులు చెరిగారు. భూకబ్జాలకు పాల్పడుతున్న ఆయన తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను దారిమళ్లించి తన భవనాల ముందు మాధవరం రోడ్లు వేయించుకున్నారని ఆరోపించారు. కార్పొరేటర్ చెప్పిన పనులు చేయొద్దని అధికారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
No comments:
Post a Comment