విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం ఆ పార్టీపై అలకబూనిన సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్తగా గత నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్న రాధాను కాదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును సమన్వయకర్తగా నియమించారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణునే పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాడని రాధాకి సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆగ్రహోదగ్రుడైన రాధా నాటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి రెండు రోజుల క్రితం రాధాను కలిసి మూడు ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచినట్టు తెలిసింది. మచిలీపట్నం ఎంపీ లేదా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని, ఈ రెండు వద్దనుకుంటే ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని చెప్పినట్టు సమాచారం. అయినా రాధా ఈ మూడు ప్రతిపాదనలపై తన స్పందన వ్యక్తం చేయలేదు.
విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం ఆ పార్టీపై అలకబూనిన సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్తగా గత నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్న రాధాను కాదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును సమన్వయకర్తగా నియమించారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణునే పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాడని రాధాకి సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆగ్రహోదగ్రుడైన రాధా నాటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి రెండు రోజుల క్రితం రాధాను కలిసి మూడు ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచినట్టు తెలిసింది. మచిలీపట్నం ఎంపీ లేదా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని, ఈ రెండు వద్దనుకుంటే ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని చెప్పినట్టు సమాచారం. అయినా రాధా ఈ మూడు ప్రతిపాదనలపై తన స్పందన వ్యక్తం చేయలేదు.
No comments:
Post a Comment