నాకు లీగల్ నోటీసులు అందలేదు: తనుశ్రీ దత్తా - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 02, 2018

నాకు లీగల్ నోటీసులు అందలేదు: తనుశ్రీ దత్తా


ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ 2008లో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా తనను వేధించాడని ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా కొద్దిరోజుల కిందట ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన బాలీవుడ్ లో సంచలనానికి కారణమైంది. చాలామంది బాలీవుడ్ నటులు ఈ విషయంలో తనుశ్రీ దత్తాకు మద్దతు తెలపగా.. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోలు సైలెంట్ గా ఉండిపోయారు. కాగా, తనుశ్రీ ఆరోపణలను ఖండించిన నానాపటేకర్ ఆమె తనకు క్షమాపణ చెప్పాలని, లీగల్ నోటీసులు కూడా పంపానని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తనకు ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదని తనుశ్రీ దత్తా తెలిపింది. తనకు లీగల్ నోటీసులు పంపినా తానేమీ భయపడబోనని వెల్లడించింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad