శ్రీనివాసరావుకు ప్రాణ హాని ఉందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 31, 2018

శ్రీనివాసరావుకు ప్రాణ హాని ఉందా?


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావును ఏమైనా చేస్తారమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌పై దాడి ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని, ఆ పథకంలో భాగంగానే శ్రీనివాసరావును ఏం చేస్తారో అంటూ  ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కూడా శ్రీనివాసరావుకు హాని జరగొచ్చని ముందు నుంచి వైఎస్సార్‌ సీపీ చెప్తోందన్నారు. తనకు ప్రాణహాని ఉందని నిందితుడు చెబుతున్నాడని, అతనికి ఏం జరిగినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad