ఉత్తరప్రదేశ్లో ఫరక్కా ఎక్స్ప్రెస్ 6 బోగీలు పట్టాలు తప్పడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు చనిపోగా, దాదాపు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అలహాబాద్కు వెడుతుండగా రాయబరేలి, హరచాంద్పూర్ రైల్వే స్టేషన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. సహాయక చర్యలను వేగంగా చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ ఆదేశించారు. ప్రమాదంలో చనిపోయినవారికి 2లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడినవారికి 50వేల రూపాయల ఎక్స్గ్రేషియాను సీఎం ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్లో ఫరక్కా ఎక్స్ప్రెస్ 6 బోగీలు పట్టాలు తప్పడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు చనిపోగా, దాదాపు 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అలహాబాద్కు వెడుతుండగా రాయబరేలి, హరచాంద్పూర్ రైల్వే స్టేషన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. సహాయక చర్యలను వేగంగా చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రైల్వేమంత్రి పియూష్ గోయల్ ఆదేశించారు. ప్రమాదంలో చనిపోయినవారికి 2లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడినవారికి 50వేల రూపాయల ఎక్స్గ్రేషియాను సీఎం ప్రకటించారు.
No comments:
Post a Comment