దుమారం రేపుతున్న శశిథరూర్ వ్యాఖ్యలు! రాహుల్ క్షమాపణ చెప్పాలి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 28, 2018

దుమారం రేపుతున్న శశిథరూర్ వ్యాఖ్యలు! రాహుల్ క్షమాపణ చెప్పాలి!


వివాదాస్పద వ్యాఖ్యలకే కేంద్రబిందువైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నే రేపుతున్నాయి. మోదీ.. శివలింగంపై కూర్చున్న తేలు వంటి వారని, ఆయనను చేతితో తొలగించలేరని, చెప్పుతో కొట్టలేరని ఓ ఆరెస్సెస్‌ నేత అన్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ గాంధీ తనను తాను శివభక్తుడిగా చెప్పకుంటారని, కాబట్టి ఆయన పార్టీకి చెందిన నేతలు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad