రవితేజ తదుపరి చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 01, 2018

రవితేజ తదుపరి చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు



మాస్ మహారాజా రవితేజ్ ప్రస్తుతం 'అమర్ అక్బర్ అంటోనీ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. నడుమందాల భామ ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత రవితేజ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' వంటి విభిన్న చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్నాడని టాలీవుడ్ సమాచారం. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. అతింద్రీయ శక్తుల ఆధారంగా ఈ సినిమా రూపొందబోతున్నట్టు తెలుగు సినీ వర్గాల సమాచారం



No comments:

Post a Comment

Post Bottom Ad