ఆ భారీ హిట్ చిత్రాల నిర్మాత డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడట! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 12, 2018

ఆ భారీ హిట్ చిత్రాల నిర్మాత డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడట!


బాలీవుడ్ లో నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమం రోజుకో మలుపులు తీసుకుంటోంది. ఒక్కొక్కరూ బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే తనుశ్రీ దత్తాతోపాటు సలోని చోప్రా, కంగన రనౌత్, ఐశ్వర్యరాయ్ వంటివారు తాము ఎదుర్కొన్న వేధింపులను బయటపెట్టగా ఈ జాబితాలో తాజాగా ఢిల్లీకి చెందిన ఒక మహిళ చేరారు. బాలీవుడ్ రొమాంటిక్ కింగ్ షారుక్ ఖాన్ తో చెన్నై ఎక్సప్రెస్, రావన్, హ్యాపీ న్యూ ఇయర్ లాంటి చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కరీం మొరానీపై ఢిల్లీకి చెందిన మహిళ ఒకరు సంచలన ఆరోపణలు చేసింది. సినిమాల్లో నటించాలని 2014లో ముంబై వెళ్లిన తనకు కరీం డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని బాంబుపేల్చింది. ఆ రోజు రాత్రి అంతా తనకు నరకం చూపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ విషయం బయట ఎక్కడైనా చెబితే మాఫియాతో చంపిస్తానంటూ బెదిరించాడని వాపోయింది.


No comments:

Post a Comment

Post Bottom Ad