తెలుగుదేశం పార్టీని, తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకునే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు జరిపిస్తోందని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. అభివృద్ధి పనులు చేయాలని అడిగినందుకు, నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని తాము గట్టిగా ప్రశ్నిస్తున్నందుకు తట్టుకోలేకే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మీద, రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ పైన దాడులు చేయించారన్నారు. ఐటీ దాడుల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న పెట్టుబడిదారులు భయపడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ దాడులు చేయించడాన్ని ఖండిస్తున్నానన్నారు.
తెలుగుదేశం పార్టీని, తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకునే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు జరిపిస్తోందని మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. అభివృద్ధి పనులు చేయాలని అడిగినందుకు, నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని తాము గట్టిగా ప్రశ్నిస్తున్నందుకు తట్టుకోలేకే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మీద, రాజ్యసభ ఎంపీ సీఎం రమేశ్ పైన దాడులు చేయించారన్నారు. ఐటీ దాడుల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న పెట్టుబడిదారులు భయపడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ దాడులు చేయించడాన్ని ఖండిస్తున్నానన్నారు.
No comments:
Post a Comment