ఆపరేషన్ గరుడ ఎవరిప్లానో తెలిసిపోయిందా? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 28, 2018

ఆపరేషన్ గరుడ ఎవరిప్లానో తెలిసిపోయిందా?


వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత ఆపరేషన్ గరుడకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. జగన్ పై దాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆపరేషన్ గరుడ నిజమవుతుందంటూ మాట్లాడటమే దీనికి కారణం. దీన్ని పరిచయం చేసింది హీరో శివాజీ అయినప్పటికీ దాన్ని పాపులర్ చేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. నిజానికి ఈ ప్లాన్ మొత్తం చంద్రబాబుదే అని కూడా విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో నిర్వహిస్తున్న సమావేశంలోనూ హీరో శివాజీ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad