విశాఖపట్నం జిల్లా అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించబోమని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం స్పష్టీకరించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. కొద్ది రోజుల కిందట అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మేల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అరకు ఉప ఎన్నిక ఉండబోదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది వేసవిలో జరిగే సాధారణ ఎన్నికలతోపాటే అరకు స్థానానికి ఎన్నికలు జరుగుతాయని స్పష్టీకరించినట్టైంది.
No comments:
Post a Comment