కుప్పం నుంచే నారా లోకేశ్ పోటీ! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 12, 2018

కుప్పం నుంచే నారా లోకేశ్ పోటీ!


చిత్తూరు జిల్లా కుప్పం నుంచే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాత్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పోటీ చేస్తారనే గాసిప్ప్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన వచ్చే ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు లోకేశ్ దొడ్డిదారిన మంత్రి అయ్యాడని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీకి వీలుగా వివిధ జిల్లాల్లో పలు నియోజకవర్గాలపై సర్వే చేయించగా ఎక్కడా లోకేశ్ కు అనుకూలంగా సర్వే ఫలితాలు రాలేదని సమాచారం. దీంతో ఆయన తన తండ్రి చంద్రబాబు నాయుడికి కంచుకోటగా ఉన్న కుప్పం నుంచి పోటీ చేయాలనే తలంపులో ఉన్నారు. మరోవైపు చంద్రబాబు కూడా తన కుమారుడు ఓడిపోతే లోకేశ్ భవిష్యత్ కెరీర్ కే ప్రమాదం కలిగే అవకాశం ఉండటంతో కుప్పం నుంచి లోకేశ్ ను పోటీ చేయించే యోచనలో ఉన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad