జనసేనలోకి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 12, 2018

జనసేనలోకి మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్

2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ దూసుకుపోతోంది. ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటన పూర్తిచేసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం కీలక నేతల చేరికలపై దృష్టసారించారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, రాపాక వరప్రసాదరావు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి నుంచి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన నాదెండ్ల మనోహర్ శుక్రవారం జనసేనలో చేరనున్నారు. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పనిచేశారు. తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా మనోహర్ పోటీ చేసే అవకాశాలున్నాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad