ఆంధ్నప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్పై జరిగిన దాడిపై సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. తెలుగు ప్రజల ఆశీస్సులతోనే జగన్ ప్రమాదం నుంచి బయటపడ్డారని అన్నారు. పెన్ను కూడా తీసుకువెళ్లలేని ఎయిర్పోర్ట్లోకి కత్తి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. కత్తి తీసుకెళ్లడానికి సహాయం చేసిన వారు ఎవరో తేలాలన్నారు. దాడి చేసింది జగన్ అభిమానే అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని మోహన్బాబు తిప్పి కొట్టారు. అభిమాని పేరుతో ఎవరు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడరని కొట్టిపారేశారు. ఐదు నిమిషాల్లో ఎటువంటి పోస్టర్లయినా తయారు చేయవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ పై జరిగిన దాడిని చాలామంది ఫోన్ చేసి ఖండించారని చెప్పారు.
ఆంధ్నప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్పై జరిగిన దాడిపై సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. తెలుగు ప్రజల ఆశీస్సులతోనే జగన్ ప్రమాదం నుంచి బయటపడ్డారని అన్నారు. పెన్ను కూడా తీసుకువెళ్లలేని ఎయిర్పోర్ట్లోకి కత్తి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. కత్తి తీసుకెళ్లడానికి సహాయం చేసిన వారు ఎవరో తేలాలన్నారు. దాడి చేసింది జగన్ అభిమానే అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని మోహన్బాబు తిప్పి కొట్టారు. అభిమాని పేరుతో ఎవరు ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడరని కొట్టిపారేశారు. ఐదు నిమిషాల్లో ఎటువంటి పోస్టర్లయినా తయారు చేయవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ పై జరిగిన దాడిని చాలామంది ఫోన్ చేసి ఖండించారని చెప్పారు.
No comments:
Post a Comment