కోహ్లి వరుసగా మూడో సెంచరీ! 107 పరుగుల వద్ద ఔట్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, October 27, 2018

కోహ్లి వరుసగా మూడో సెంచరీ! 107 పరుగుల వద్ద ఔట్!


భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీ సాధించాడు. మొదటి రెండు వన్డేల్లో శతకాలు బాదిన కోహ్లీ మూడో వన్డేలోనూ చెలరేగిపోయాడు. దీంతో వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్ ల్లో మూడో సెంచరీ సాధించాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్‌ బాది 38వ సెంచరీ చేశాడు. పరుగుల యంత్రంగా కోహ్లి ఫుల్‌ ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. రోహిత్‌(8), ధావన్‌ (35), రాయుడు (22), పంత్‌ (24), ధోని(7)లు వెనుదిరగడంతో భారత్‌ 194 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో శక్తిమేరకు పోరాడిన కోహ్లీ 119 బంతుల్లో 107 పరుగులు చేసి శామ్యూల్స్ చేతిలో ఔటయ్యాడు. 

No comments:

Post a Comment

Post Bottom Ad