తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమి తరఫున ఎక్కడి నుంచి పోటీ చేయాలా అనే అంశం కొన్ని రోజులుగా చర్చనీయాంశం అయింది. అసలు పోటీ చేయాలా? లేకుంటే కూటమి తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలా? అనే ఆలోచనలో ఇప్పటివరకు ఉన్న ప్రొఫెసర్ చివరకు ఎన్నికల్లో పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే కూటమిలో ఏయే పార్టీ, ఎన్ని స్థానాలకు పోటీ చేయాలనే దానిపైనే ఇంకా చర్చలు సాగుతున్న నేపథ్యంలో కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. జనగామ, వరంగల్ వెస్ట్, మంచిర్యాల నుంచి పోటీకి దిగాలని అనుకున్నా ఆయా నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పొన్నాల లక్ష్మయ్య, నాయిని రాజేందర్ రెడ్డి లేదా వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ రావును బరిలో ఉంచాలని చూస్తోంది. దీంతో దీంతో అసలు కోదండరాం పోటీ చేస్తారా? చేయరా అనేది చర్చనీయాంశంగానే మిగిలిపోతోంది.
తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమి తరఫున ఎక్కడి నుంచి పోటీ చేయాలా అనే అంశం కొన్ని రోజులుగా చర్చనీయాంశం అయింది. అసలు పోటీ చేయాలా? లేకుంటే కూటమి తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలా? అనే ఆలోచనలో ఇప్పటివరకు ఉన్న ప్రొఫెసర్ చివరకు ఎన్నికల్లో పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే కూటమిలో ఏయే పార్టీ, ఎన్ని స్థానాలకు పోటీ చేయాలనే దానిపైనే ఇంకా చర్చలు సాగుతున్న నేపథ్యంలో కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. జనగామ, వరంగల్ వెస్ట్, మంచిర్యాల నుంచి పోటీకి దిగాలని అనుకున్నా ఆయా నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పొన్నాల లక్ష్మయ్య, నాయిని రాజేందర్ రెడ్డి లేదా వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ రావును బరిలో ఉంచాలని చూస్తోంది. దీంతో దీంతో అసలు కోదండరాం పోటీ చేస్తారా? చేయరా అనేది చర్చనీయాంశంగానే మిగిలిపోతోంది.
No comments:
Post a Comment