ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇప్పటికే తెలుగుదేశఃం పార్టీ ఇంటెలిజెన్స్ విభాగంతోనూ, డ్వాక్రా యానిమేటర్లు, ఒక కార్పొరేట్ కళాశాల సిబ్బందితో సర్వేలు చేయించగా, ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ వందల కోట్ల రూపాయలు చెల్లించి ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ ను నియమించుకుంది. ఆయన పార్టీకి విజయం సాధించిపెట్టడమే లక్ష్యంగా సర్వేలు మీద సర్వేలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా ఎన్నికల సర్వేల గోదాలోకి దిగుతోంది. క్షేత్ర స్థాయిలో తమ బలం ఎంతో తెలుసుకోవడానికి సర్వే చేయిస్తోంది. ఈ సర్వేలో పదవీ విరమణ చేసి జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వీరిచ్చే నివేదిక ఆధారంగా పవన్ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకునే వీలుంది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇప్పటికే తెలుగుదేశఃం పార్టీ ఇంటెలిజెన్స్ విభాగంతోనూ, డ్వాక్రా యానిమేటర్లు, ఒక కార్పొరేట్ కళాశాల సిబ్బందితో సర్వేలు చేయించగా, ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ వందల కోట్ల రూపాయలు చెల్లించి ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ ను నియమించుకుంది. ఆయన పార్టీకి విజయం సాధించిపెట్టడమే లక్ష్యంగా సర్వేలు మీద సర్వేలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా ఎన్నికల సర్వేల గోదాలోకి దిగుతోంది. క్షేత్ర స్థాయిలో తమ బలం ఎంతో తెలుసుకోవడానికి సర్వే చేయిస్తోంది. ఈ సర్వేలో పదవీ విరమణ చేసి జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వీరిచ్చే నివేదిక ఆధారంగా పవన్ అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకునే వీలుంది.
No comments:
Post a Comment