కేన్సర్‌ చికిత్సలో కొత్త విధానం! నోబెల్ బహుమతి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 02, 2018

కేన్సర్‌ చికిత్సలో కొత్త విధానం! నోబెల్ బహుమతి!


కేన్సర్‌పై పరిశోధనలు చేసినందుకు ఈ ఏడాది మెడిసిన్ విభాగంలో వ్యాధి నిరోధక శాస్త్రనిపుణులైన అమెరికా వైద్యుడు జేమ్స్‌ అలిసన్‌ (70), జపాన్‌కు చెందిన తసుకు హొంజో (76)లకు సంయుక్తంగా నోబెల్ బహుమతి లభించింది. అలిసన్, హొంజోలు  ఇమ్యునోథెరపీ అనే కొత్త విధానంలో మరింత వేగంగా కేన్సర్‌ను తగ్గించేందుకు రోగి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఎలా సాయపడుతుందనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు. ఈ బహుమతి ద్వారా వీరికి పది లక్షల డాలర్ల నగదు బహుమతిని అందజేయనున్నారు. జపాన్‌కు చెందిన తసుకు హోంజో కేన్సర్ ఇమ్యునోథెరపీపై పరిశోధనలు చేస్తున్నారు. అమెరికాకు చెందిన జేమ్స్ పి. అల్లిసన్ ఎం.డి. అండర్సన్ కేన్సర్ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా, ఇమ్యునాలజీ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. ఇమ్యునోథెరపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. డైనమెట్‌కు రూపకల్పన చేసిన అల్ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఆయన వర్ధంతి రోజైన డిసెంబర్‌ 10న స్టాక్‌హోంలో స్వీడన్‌ రాజు కార్ల్‌–16 వీరికి బహుమతిని అందజేస్తారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad