వెస్టిండీస్ మొదటి టెస్టులో తలపడే భారత జట్టు ఇదే - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

వెస్టిండీస్ మొదటి టెస్టులో తలపడే భారత జట్టు ఇదే


ఇటీవల ఆసియా కప్ క్రికెట్ వన్డే టోర్నమెంట్ ను గెలుచుకున్న టీమిండియా వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతోంది. మొదటి టెస్టులో పాల్గొనే భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత జట్టు సభ్యులు వీరే.. లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, అశ్విన్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్. కాగా, పృధ్వీ షాకు ఇదే మొదటి టెస్ట్ కావడం గమనార్హం. ఆసియా కప్ లో విశేషంగా రాణించిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లకు భారత టెస్టు జట్టులోకి ఎంపిక చేయకపోవడం సంగతి తెలిసిందే. మొదటి రెండు టెస్టులను ఇదే టీమ్ ఆడుతోందని భారత్ సెలక్షన్ కమిటీ తెలిపింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad