రెండో టెస్టులో తొలి రోజు వెస్టిండీస్ స్కోరు 295/7 - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Friday, October 12, 2018

రెండో టెస్టులో తొలి రోజు వెస్టిండీస్ స్కోరు 295/7


భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్ లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో  శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు వెస్టిండీస్ ఏడు వికెట్ల నష్టానికి  295 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 92 పరుగులకే నాలుగు వికెట్లు నష్టపోయింది. ఆ జట్టు బ్యాట్సమన్లలో ఆరో స్థానంలో బ్యాటింగ్ కొచ్చిన రోస్టన్ చేజ్ అద్భుతంగా ఆడి 98 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం రోస్టన్ చేజ్ తోపాటు క్రీజులో దేవేంద్ర బిషూ ఉన్నాడు. భారత బౌలర్లలో కులదీప్ యాదవ్ 3, ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీశారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad