వెస్టిండీస్ తో రాజ్ కోట్ లో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 649 పరుగులు చేయగా వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ తప్పించుకోలేకపోవడంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ 196 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు భారీ విజయం దక్కింది. భారత బ్యాట్సమన్లలో పృథ్వీషా, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు సెంచరీలు బాదగా, వెస్టిండీస్ లో ఎవరూ సెంచరీలు చేయలేదు. ఇక భారత బౌలర్లలో వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో రవిచంద్ర అశ్విన్ 4, మహ్మద్ షమి 2 వికెట్ల తీశారు. ఇక వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ కులదీప్ యాదవ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. రవీంద్ర జడేజా కూడా మూడు వికెట్లు తీయడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది.
వెస్టిండీస్ తో రాజ్ కోట్ లో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 649 పరుగులు చేయగా వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ తప్పించుకోలేకపోవడంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ 196 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు భారీ విజయం దక్కింది. భారత బ్యాట్సమన్లలో పృథ్వీషా, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు సెంచరీలు బాదగా, వెస్టిండీస్ లో ఎవరూ సెంచరీలు చేయలేదు. ఇక భారత బౌలర్లలో వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో రవిచంద్ర అశ్విన్ 4, మహ్మద్ షమి 2 వికెట్ల తీశారు. ఇక వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ కులదీప్ యాదవ్ ఐదు వికెట్లతో చెలరేగాడు. రవీంద్ర జడేజా కూడా మూడు వికెట్లు తీయడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది.
No comments:
Post a Comment