ఇప్పటికీ చేతులతోనే మానవ విసర్జితాలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

ఇప్పటికీ చేతులతోనే మానవ విసర్జితాలు


దేశం సాంకేతికంగా, పారిశ్రామికంగా ముందంజలో దూసుకుపోతున్నప్పటికీ మనదేశంలో ఇప్పటికీ మానవ విసర్జితాలను చేతులతోనే ఎత్తుతున్నారు. ఇలా మానవవిసర్జితాలను చేతులతోనే ఎత్తుతున్నవారు దేశంలో 20 వేలమంది ఉండగా.. ఇందులో ఆరువేల మందికిపైగా ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నారు. జాతీయ పారిశుధ్య కార్మికుల ఆర్థిక, అభివృద్ధి సంఘం (ఎన్ఎస్కేఎఫ్డీసీ) సహాయంతో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతల శాఖ చేపట్టిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 18 రాష్ట్రాల్లో 170 జిల్లాల్లో సర్వే నిర్వహించగా దిగ్బ్రమ పరిచే వాస్తవాలు వెలుగుచూశాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 6126 మంది, మహారాష్ట్రలో 5269 మంది, కర్ణాటకలో 1744 మంది మానవ విసర్జితాలు చేతులతోనే తీస్తున్నట్టు తేలింది. గుజరాత్, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ మానవ విసర్జితాలను చేతులతో ఎత్తేవారు ఉన్నారని సర్వే తేల్చింది.

No comments:

Post a Comment

Post Bottom Ad