గుత్తా జ్వాలను వేధించిన ఆ వ్యక్తి ఎవరు? - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 11, 2018

గుత్తా జ్వాలను వేధించిన ఆ వ్యక్తి ఎవరు?


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.. గుత్తా జ్వాల కూడా 'మీటూ' ఉద్యమంలో చేరిపోయింది. మహిళల డబుల్స్ బ్యాడ్మింటన్ లో అంతర్జాతీయ స్థాయిలో మంచి విజయాలు సాధించిన జ్వాల తనను ఒక వ్యక్తి వేధించాడని బాంబుపేల్చింది. 2006లో బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ గా పనిచేసిన ఆ వ్యక్తి మానసికంగా తనపై వేధింపులకు పాల్పడ్డాడని, తాను బ్యాడ్మింటన్ ను వదిలేయడానికి అతడు కారణమని ఆరోపించింది. ఇప్పటికీ బ్యాడ్మింటన్ క్రీడలోనే ఆ వ్యక్తి ఉన్నాడంటూ దుయ్యబట్టింది. అయితే అతడి పేరును వెల్లడించడకపోవడంతో ఆ వ్యక్తి ఎవరో ప్రశ్నార్థకంగా మారింది. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను వివాహం చేసున్న జ్వాల తక్కువ కాలానికే అతడికి విడాకులిచ్చింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad