నేడు దుర్గమ్మ సేవలో గవర్నర్ నరసింహన్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, October 11, 2018

నేడు దుర్గమ్మ సేవలో గవర్నర్ నరసింహన్!


రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌... ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గురువారం విజయవాడలో కొలువైన దుర్గమ్మను సందర్శించుకుంటారు. దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని గవర్నర్ ప్రత్యేక పూజలు చేస్తారు. గవర్నర్.. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 8.05 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఉదయం 8.20 గంటలకు విజయవాడలోని గేట్‌వే హోటల్‌కు వెళ్లి బస చేస్తారు. అక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్లి మంగళగిరిలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బయల్దేరి 1.20 గంటలకు గేట్‌వేకు వెళ్తారు. 2.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హైదరాబాద్‌ వెళతారు.

No comments:

Post a Comment

Post Bottom Ad