మాజీ కేంద్ర మంత్రి, ఐదుసార్లు ఏలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలిచిన కావూరి సాంబశివరావు కుమారుడు భాస్కరరావు వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్ లోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా భాస్కరరావు పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. ఈ నేపథ్యంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన భాస్కరరావు శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ లోనే ఉన్న కావూరి సాంబశివరావు రాష్ట్రాన్ని విభజించిన తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
మాజీ కేంద్ర మంత్రి, ఐదుసార్లు ఏలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల నుంచి ఎంపీగా గెలిచిన కావూరి సాంబశివరావు కుమారుడు భాస్కరరావు వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్ లోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా భాస్కరరావు పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. ఈ నేపథ్యంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన భాస్కరరావు శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ లోనే ఉన్న కావూరి సాంబశివరావు రాష్ట్రాన్ని విభజించిన తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment