ముందుస్తు ఎందుకో హైకోర్టులో చెప్పిన ప్రభుత్వ న్యాయవాది! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 09, 2018

ముందుస్తు ఎందుకో హైకోర్టులో చెప్పిన ప్రభుత్వ న్యాయవాది!


తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తూ, కోర్టుల్లో దాదాపు 200ల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసినందుకు.. ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో నిజాయితీని నిరూపించుకునేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తోందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది, సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ సి. ఆర్యమ సుందరం హైకోర్టుకు తెలిపారు.  ముందస్తు ఎన్నికలు, ఓటరు జాబితా సవరణ సహా తదితర అంశాలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేకపోతే ప్రజలే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడిస్తారని చెప్పారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad