నా తదుపరి చిత్రం గీతాఆర్ట్స్ లోనే ఉంటుంది: దర్శకుడు మారుతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

నా తదుపరి చిత్రం గీతాఆర్ట్స్ లోనే ఉంటుంది: దర్శకుడు మారుతి


టాలీవుడ్ లో చిన్న చిత్రాలతో మొదలుపెట్టి మీడియం బడ్జెట్ హీరోలతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగిన దర్శకుడు.. దాసరి మారుతి. తాజాగా మారుతి దర్శకత్వం వహించిన శైలజారెడ్డి అల్లుడుకి రివ్యూల పరంగా డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే సాధించింది. ఈ చిత్రం తర్వాత మెగా నిర్మాత అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక చిత్రాన్ని చేయనున్నట్టు మారుతి తెలిపాడు. వివిధ పనుల నిమిత్తం తన సొంత ఊరు మచిలీపట్నం వచ్చిన ఈ దర్శకుడు మీడియాతో ముచ్చటించాడు. హాస్యభరితమైన ఒక కథను రూపొందిస్తున్నానని, ఒక ప్రముఖ హీరో ఇందులో నటిస్తాడని తెలిపాడు. నానితో భలే భలే మగాడివోయ్, శర్వానంద్ తో మహానుభావుడు వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దాసరి మారుతి.. గీతా ఆర్ట్స్ లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో వేచిచూడాల్సిందే. 

No comments:

Post a Comment

Post Bottom Ad