కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంను రూ. 3,500 కోట్ల ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎ1 నిందితుడిగా చార్జిషీట్లో పేర్కొంది. ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, ఎస్. భాస్కరణ్(కార్తీ), ఎయిర్సెల్ మాజీ సీఈఓ వి. శ్రీనివాసన్తోపాటు మరో 9 మందిని నిందితులుగా ఈడీ చార్జ్షీట్లో చేర్చింది. ఈ చార్జిషీటును నవంబర్ 26న సీబీఐ స్పెషల్ కోర్టులో విచారించనున్నారు. అయితే సీబీఐ, ఈడీలు తనను అరెస్ట్ చేయకుండా చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసులో నవంబరు 29 వరకు చిదంబరంతోపాటు ఆయన కుమారుడు కార్తీని అరెస్ట్ చేయొద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంను రూ. 3,500 కోట్ల ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎ1 నిందితుడిగా చార్జిషీట్లో పేర్కొంది. ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, ఎస్. భాస్కరణ్(కార్తీ), ఎయిర్సెల్ మాజీ సీఈఓ వి. శ్రీనివాసన్తోపాటు మరో 9 మందిని నిందితులుగా ఈడీ చార్జ్షీట్లో చేర్చింది. ఈ చార్జిషీటును నవంబర్ 26న సీబీఐ స్పెషల్ కోర్టులో విచారించనున్నారు. అయితే సీబీఐ, ఈడీలు తనను అరెస్ట్ చేయకుండా చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కేసులో నవంబరు 29 వరకు చిదంబరంతోపాటు ఆయన కుమారుడు కార్తీని అరెస్ట్ చేయొద్దంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
No comments:
Post a Comment